చిలకలూరిపేట,గుంటూరు: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పౌరాణిక నాటక పోటీల్లో చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన సింగరకొండయ్య చౌదరి మరోమారు సత్తా చాటారు. శ్రీకృష్ణ రాయబారం సందేశంలో శ్రీకృష్ణుణి పాత్రను అద్భుతంగా పోషించిందుకు ప్రథమ బహుమతిని సాధించారు. సింగర కొండ య్య చౌదరి జిల్లా తెలుగుదేశం సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడి గా వ్యవహరిస్తూ పలు పౌరాణిక పోటీల్లో జాతీయ, రాష్ట్రస్థాయి బహుమతులను సాధించారు. రాష్ట్రమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నాయకులు నెల్లూరి సదాశివరావు, పేర్ని వీరనారాయణ, విడదల లక్ష్మీనారాయణ, తేలప్రోలు వీరయ్య, తేళ్ల సుబ్బారావు సింగరకొండయ్యను అభినందించారు.