హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి కబ్జాల కల్చర్‌ని ఆంధ్రప్రదేశ్‌కు పట్టుకొచ్చారని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించడం తెలంగాణని అవమానించడమేనని తెలంగాణ రచయితల వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం గుంటూరులో నిర్వహించిన సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచేలా ఉన్నాయని వేదిక అధ్యక్షుడు జయధీర్‌ తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇదే సభలో ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ మాటలతోనే పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.