గుంటూరు: అమెరికా వాషింగ్టన్ డీసీలో సెప్టెంబర్ 23, 24న మొట్టమొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ అధ్యక్షుడు బొమ్మారెడ్డి భాస్కర్, వంగూరి ఫౌండేషన్ కన్వీనర్ వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘాలు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఫోన్లో తెలిపారు. 50 ఏళ్ల నుంచి అమెరికాలో కొనసాగుతున్న తెలుగు సాహిత్య ప్రక్రియలు, తెలుగు కథ, కవితల ఆవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు తదితర సాహిత్యపరమైన అంశాలపై సదస్సులో సమీక్షిస్తారని చెప్పారు.