నవంబరులో హైదరాబాద్‌లో ఆవిష్కరణ: గొల్లపూడి

సిరిపురం(విశాఖ సిటీ), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నవంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు సంపాదకులు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాహితీ సంచిక కార్యక్రమానికి అక్షరరూపమే ఈ గ్రంథమన్నారు. గత వందేళ్లలో తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన 116మంది రచయితల వైభవానికి ప్రతీకగా ఇది నిలుస్తుందన్నారు. ఆవిష్కరణ అనంతరం ఈ గ్రంథాన్ని పొందాలనుకునేవారు బొడ్డేటి జగత్‌రావు(9848634030)ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో విజయ్‌ నిర్మాణ్‌ కంపెనీ అధినేత విజయకుమార్‌, పబ్లిషర్‌ సూరిబాబు పాల్గొన్నారు.