చిక్కడపల్లి, నవంబర్‌13(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు రామకృష్ణకు ప్రముఖ కార్టూనిస్టు వెంకట్‌ అక్కిరాజు పురస్కారం-2018 ప్రదానం చేశారు. వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయగానసభలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానించారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్‌ పాత్రికేయుడు వల్లీశ్వర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనగా గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, 2012 పురస్కారగ్రహీత శంకు, ప్రముఖ కార్టూనిస్ట్‌ బాచి(అన్నం శ్రీధర్‌) తదితరులు ప్రసంగించారు. వెంకట్‌ ప్రవృత్తిగా కార్టూనింగ్‌లో గ్రీటింగ్‌ కార్డుల వంటి కళాకృతుల రూపకల్పనలో సాధన చేశారన్నారు.ఈ కార్యక్రమంలో డా. తెన్నేటి సుధాదేవి తదితరులు  పాల్గొన్నారు.