విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష, సాహిత్యాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రద్ధ, చిత్తశుద్ధి లేవని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ విమర్శించారు. ఆయన విశాఖలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల నాలుగు అకాడమీలకు చైర్మన్లను సీఎం నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. యోగ్యులు, అర్హులైన వారినే చైర్మన్లుగా నియమించారని, అయితే వారు ఇప్పుడు చేయడానికి ఏమీలేదని ఆవేదన వ్యక్తంచేశారు.