ఆంధ్రజ్యోతి,విజయవాడ: శ్రీ హేవళంబి ఉగాది నామ సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని 39 మంది ప్రముఖులకు కళారత్న అవార్డులు అందజేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళారత్న గ్రహీతలకు రూ.50 వేల నగదు, హంస ప్రతిమ అందజేశారు. వారిలో కవులు, కళాకారులు, తదితర ప్రముఖులు ఉన్నారు.