రాంనగర్‌,హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీకి చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహా దా రు డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. కవయిత్రి, సంఘసేవ కురాలు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్‌ లక్కరాజు నిర్మల తన కుమార్తె ప్ర ఫుల్లా జ్ఞాపకార్థం విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో నీటి వసతి ఏర్పాటు చేసేందుకు బోరింగ్‌, కరెంట్‌ మోటారు బిగిం చడం కోసం కావాల్సిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్‌ రూ పంలో గురువారం డా.కె.వి.రమణాచారి చేతుల మీదుగా రెడ్‌క్రాస్‌ సొసైటీకి అందజేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడు తూ రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలను పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాత నిర్మల మాట్లాడు తూ యేటా మార్చి 23న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ మధుమో హన్‌, ప్రతినిధులు కోటిరెడ్డి, భీంరెడ్డి, నర్సింహారెడ్డి, పాండు, బల రాం, సతీష్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.