చిక్కడపల్లి, మే 23(ఆంధ్రజ్యోతి): మాతృత్వం ఒక వరం అనే మాటకు, అక్షరరూపం అమ్మంటేనే రచన అని వక్తలు పేర్కొన్నారు. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో ఎస్‌.విజయలక్ష్మి రచించిన ‘అమ్మంటే’ వచన కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. రచయిత్రి, డాక్టర్‌ ముక్తేవి భారతి మాట్లాడుతూ ఇందులోని కవితలన్నీ అమ్మ చుట్టూ పచ్చని పందిరి వేశాయన్నారు. ఈ కార్యక్రమంలో కళా జనార్దన మూర్తి, పద్మావతి, జయరాములు, హైమవతీ భీమన్న, దుర్గాప్రసన్న పాల్గొన్నారు.