బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 19(ఆంధ్రజ్యోతి): తెలుగు సంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా కృషి చేయాలని  తమిళనాడు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. మన రేడియో ఎఫ్‌ఎం మొబైల్‌ యాప్‌ను ఆయన శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సినిమా, ఆధ్యాత్మిక గీతాలు అందరూ వినేందుకు యాప్‌ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సినీ నిర్మాత అల్లుఅరవింద్‌ మాట్లాడుతూ పాత పాటలు వినాలనిపించినప్పుడు గతంలో వాటిని వెతుక్కోవాల్సి వచ్చేదని,ఇలాంటి యాప్‌ల వల్ల ఆ సమస్య తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు శ్యాంప్రసాద్‌, రఘుకుంచె, అల్లరి నరేష్‌, కార్తికేయ, పూజ తదితరులు పాల్గొన్నారు.