రవీంద్రభారతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కళారత్న జీడిగుంట రామచంద్రమూర్తి 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రచించిన నేను- నా జ్ఞాపకాలు పుస్తకావిష్కరణ బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో జరిగింది. అతిథులుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ రావులపాటి సీతారామారావు, డా.ఓలేటి పార్వతీశం, సత్యవోలు సుందరసాయి, నటుడు సుబ్బరాయశర్మ, డా.జె.చెన్నయ్య తదితరులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డా.బీఎ్‌స.శివారెడ్డికి అంకితమిచ్చారు.ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా సత్కరించి తొలి పుస్తకాన్ని అందజేశారు. అనంతరం సీతారామారావు మాట్లాడుతూ జీడిగుంట రామచంద్రమూర్తి తన అనుభవాలకు అక్షరరూపం ఇవ్వడం అభినందనీయమన్నారు. ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ జీవితంలో మధురమైన అనుభవాలు ఉన్న వారు ఇలాంటి పుస్తకాలు తీసుకురావాలన్నారు.  ఈ కార్యక్రమంలో మద్దాళి రఘురామ్‌,  పాల్గొన్నారు.