రవీంద్రభారతి, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న యువ నాటకోత్సవం నూతన నటీనటుల ప్రతిభను చాటుతోంది.  శ్రీవిజయ భారతీ నాట్యమండలి ఆధ్వర్యంలో హారికవర్మ రేకందర్‌ దర్శకత్వం వహించిన ‘సుధారమె అను కాంతిమతి’, మిర్రర్‌ థియేటర్‌ పెద్దపల్లి ఆధ్వర్యంలో సాంబశివమూర్తి దర్శకత్వం వహించిన జిహాద్‌ నాటకాలను ప్రదర్శించారు. విశ్వహిత కళాకేంద్రం ఆధ్వర్యంలో చరమస్థలం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వేదకుమార్‌, ఖాజాపాషా, మల్లేష్‌ బలాస్ట్‌  పాల్గొని కళాకారులను సత్కరించారు.