వరంగల్‌ కల్చరల్‌, నవంబరు 11: కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని ఈసారి నల్గొండకు చెందిన ప్రముఖ కవి వేణు సంకోజుకు ఇవ్వనున్నారు. కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్‌ విద్యార్థి సోమవారం ఈ విషయం ప్రకటించారు. హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బుధవారం జరిగే కాళోజీ సోదరుల యాది సభలో ఆయనకు రూ10 వేలతోపాటు దుశ్శాలువా, జ్ఞాపికను ప్రదానం చేస్తారు. నల్గొండకు చెందిన వేణు సంకోజు లెక్చరర్‌గా పదవీ విమరణ చేశారు. 1972 నుంచి సాహిత్యంలో విశేషంగా కృషి చేశారు. కాళోజీకి సన్నిహిత మిత్రుల్లో ఒకరు.