Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
కవితా నేర్పరి ప్రసాదమూర్తి: ఆచార్య ఎన్. గోపి
కవితా నేర్పరి ప్రసాదమూర్తి: ఆచార్య ఎన్. గోపి
హైదరాబాద్:
ఒక వస్తువును కవిత్వంగా ఎలా మలచాలో తెలిసినవాడు ప్రసాదమూర్తి అని ఆచార్య ఎన్. గోపి కొనియాడారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కవి సంధ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రసాదమూర్తి రచనల ఆవిష్కరణ సభ జరిగింది. కార్య క్రమంలో తొలిగా ‘‘చేనుగట్టు పియానో’’ కవితా సంపుటిని ఎన్.గోపి ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ పాత్రికేయులు, కవి అరుణ్సాగర్ సహచరి ప్రసన్నకి అందచేశారు. సిద్ధాంత పరిశోధనా గ్రంథం ‘‘ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’’ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఎన్. గోపి మాట్లాడుతూ రైతు పాడుతున్న మృత్యుగీతను కవి మలిచిన తీరు హృదయాన్ని మీటుతుం దన్నారు.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రసాదమూర్తి కవిత్వాన్ని ఇష్టపడతాను, అందుకు కారణం ఆయన అరుణ్సాగర్ మెచ్చిన కవి కావడమే అన్నారు. ఎంతటి తీవ్రమైన విషయాన్నైనా లాలిత్యంతో చెప్పడం ప్రసాదమూర్తి కవిత్వం ప్రత్యేకతని శ్లాఘించారు. రోహిత్ వేముల మరణం, నిర్వాసిత్వతం, కల్బుర్గి హత్య వంటి సం ఘటనలపై బోలెడంత కవిత్వాన్ని నిర్మించి, సున్నితత్వంగా చెప్పడం ప్రసాదమూర్తి సామాజిక, రాజకీయ భావాలకి నిదర్శనం అని అభినందించారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి సాహిత్యపేజీలో ప్రచురితమైన కవితలను చదివి, నచ్చితే వెంటనే ఆ కవులకి ఫోన్ చేసి మాట్లాడుతుంటానన్నారు. అలా పరిచయమేర్పడి ప్రసాద మూర్తి సభకి వచ్చేలా చేసిందని తెలిపారు. వాక్యం రసాత్మ కం కావ్యం అంటారు, ప్రసాదమూర్తి ప్రతి వాక్యం రసాత్మ కంగా ఉందని కీర్తించారు. అధ్యక్షత వహించిన ప్రముఖ కవి కె. శివారెడ్డి మాట్లాడుతూ ఈ పుస్కకావిష్కరణ సభకి అరుణ్ సాగర్ వేదికగా పేరు పెట్టడంతోపాటు, అతని స్మృతికి అంకితమివ్వడం ప్రసాదమూర్తి, సాగర్ మధ్య స్నేహబంధం ఎంత దృఢమైందో తెలుపుతుందన్నారు. కార్య క్రమంలో విమర్శకుడు లక్ష్మినరసయ్య, డా. పిల్లల మర్రి రాములు, కొండేపూడి నిర్మల, శిఖామణి, మువ్వా శ్రీనివాసరావు,శ్రీరాములు,తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.