ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాఖ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విరియాల లక్ష్మీపతి స్మారక పురస్కారాన్ని చింతకింది శ్రీనివాసరావు, అట్టాడ అప్పలనాయుడుకు అందుకుంటారు. నవంబర్ 11 సా.6 గంలకు, నవంబర్ 18 సా.6గం.లకు విశాఖపట్నం టర్నర్ చౌల్ట్రీ లో విశాలాంధ్ర నిర్వహిస్తున్న పద్దెనిమిదో పుస్తక మహోత్సవం ప్రాంగణ వేదికపై నగర ప్రముఖుల చేతుల మీదుగా పురస్కార గ్రహీతలు అవార్డులను అందుకొంటారు. ఒక్కొక్క పురస్కారం కింద జ్ఞాపిక, పదివేల రూపాయల నగదు, ప్రశంసా పత్రం గ్రహీతలు స్వీకరిస్తారు.
- చందు సుబ్బారావు